పాకిస్తాన్ వైపు 15 వేల మంది తాలిబన్ ల కవాతు!

పాకిస్తాన్ వైపు 15 వేల మంది తాలిబన్ ల కవాతు!

పాకిస్తాన్ దశాబ్దాలుగా, వ్యూహాత్మక కారణాలతో తాలిబాన్‌లను పెంచి పోషించింది. చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించి, సైనిక సహాయాన్ని అందించింది. అయితే, ఇప్పుడు అదే తాలిబాన్లు పాకిస్తాన్‌పై తిరుగుబాటు ప్రకటించి, దాడులకు దిగుతున్నారు. ఈ విధంగా ఆఫ్ఘన్ తాలిబాన్ తెహ్రీక్-ఇ-తాలిబాన్, పాకిస్తాన్ కష్టాలను మరింతగ పెంచుతుంది.

“పాత కథలా ఉంది. మీరు పాములను పెరట్లో ఉంచి, అవి మీ పొరుగువారిని మాత్రమే కాటు వేయాలని ఆశించలేరు. చివరికి, ఆ పాములు పెరట్లో ఉన్నవారిపై తిరగబోతున్నాయి” అని హిల్లరీ క్లింటన్ 2011లో పాకిస్తాన్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య ప్రతిధ్వనిస్తోంది. నివేదికల ప్రకారం, దాదాపు 15,000 మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సరిహద్దు వైపు కవాతు చేస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత, తాలిబాన్ వారు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ దాడులు ప్రారంభించారు. ఇప్పటికే, పాకిస్తాన్ జెట్ విమానాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ స్థావరాలపై దాడులు చేశారు. శిక్షణా కేంద్రాన్ని కూల్చివేయడంలో 46 మంది మరణించారు. ఎక్కువగా మహిళలు, పిల్లలు వారిలో ఉన్నారు.  కాబూల్‌లోని తాలిబాన్ ప్రతినిధి ఈ దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, 15,000 మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటున్నట్టు సమాచారం. పాకిస్తాన్ ప్రస్తుతం రెండు తాలిబాన్ గ్రూపుల సవాలును ఎదుర్కొంటోంది: ఒకటి, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి), మరొకటి ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలో ఉన్న తాలిబాన్.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చాక, వారు టిటిపిని బలపరిచి, పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులను పెంచారు. 2023లో ఉగ్రవాద దాడుల కారణంగా 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలు పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను మరింత సంక్లిష్టతరం చేస్తున్నాయి. పాకిస్తాన్ తాలిబాన్‌కు గతంలో ఇచ్చిన మద్దతు ఇప్పుడు తమకు తిరుగుబాటు చేస్తోంది. 

పాకిస్తాన్ సైనిక దాడులు, టిటిపిపై చర్యలు, అలాగే ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు మరింత తీవ్రమవుతున్నాయి. పాకిస్తాన్, దశాబ్దాలుగా తాలిబాన్‌ను పెంచి, వారిని వ్యూహాత్మకంగా ఉపయోగించింది. 1990లో, పాకిస్తాన్ తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్‌ను చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తించింది.

పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తాలిబాన్‌ను సైనికంగా సహాయం చేసింది. కానీ, ఇప్పుడు ఈ సహాయం పాకిస్తాన్‌కు తిరుగుబాటు చేయడమే కాక, దేశంలో అత్యంత తీవ్రమైన ఉగ్రవాద దాడులను తెచ్చిపెట్టింది. భారత్‌కు ఉగ్రవాదాన్ని  ఎగుమతి చేసేందుకు పాకిస్తాన్, తాలిబాన్‌ను ఉపయోగించింది.

పాకిస్తాన్, కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాలిబాన్‌ను వ్యూహాత్మకంగా ఉపయోగించింది. 1990లు, 2000లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా వంటి గ్రూపులు తాలిబాన్- నియంత్రిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నాయి.ఇప్పుడు పాకిస్తాన్, రెండు తాలిబాన్ సమూహాలతో వ్యవహరించడం తప్పనిసరిగా మారింది. 

పాకిస్తాన్ ఇప్పటికీ ఈ సవాలును ఎదుర్కొంటోంది. ఈ రెండు సమూహాలు, ఒక్కటి కాబూల్‌లో, మరొకటి టిటిపి రూపంలో, పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలు, హిల్లరీ క్లింటన్ 2011లో చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తోంది. పాకిస్తాన్ ఒకప్పుడు తాలిబాన్‌ను వ్యూహాత్మకంగా పెంచింది, ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్‌ యొక్క భద్రతను సవాలు చేస్తోంది.