
గత పాలకుల్లో కొంత మంది ఈ అవినీతికి పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యం వ్యవహారంపై తాము పలుమార్లు ప్రస్తావించిన విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. పీడీఎస్ బియ్యం అంశంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్న తీరు సరైనదేనని పురందేశ్వరి స్పష్టం చేశారు.
పేదలకు అందించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చాలా తక్కువ సమయంలో11 కోట్ల మంది సభ్యత్వం పొందారని ఆమె వివరించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 25 లక్షల మంది కొత్తగా బీజేపీలో సభ్యత్వం పొందారని చెప్పారు. అందుకు పార్టీ కార్యకర్తల కృషి ప్రశంసనీయమైనదని, కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
భవిష్యత్తులో పారదర్శకంగా, సమర్థవంతరంగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందని చెబుతూ హర్యానా, మహారాష్ట్రలలో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇక జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం భారీగా పెరిగిందని చెప్పారు.
అదానీ వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆమె విమర్శించారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అదానీతో బీజేపీకి సంబంధం లేదని మాజీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈవీఎం టాంపరింగ్ అంటూ బీజేపీపై విపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని పురందేశ్వరి ఆరోపించారు.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం