
మరోవైపు పూజాఖేద్కర్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీసు విచారణ జరగనుంది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ కమిషనర్- పుణె పోలీసులతోపాటు జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. నకిలీ పత్రాలతో పూజ దివ్యాంగుల కోటా ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం వాసిమ్ జిల్లాలో పోస్టింగ్ పొందిన పూజా ఖేద్కర్, యుపిఎస్సికి సమర్పించిన పలు ధ్రువపత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉంది. ఈ సర్టిఫికెట్లను అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రి మెడికల్ బోర్డు జారీ చేసింది. నేత్ర వైకల్య ధ్రువీకరణను 2018, మానసిక వైకల్య ధ్రువీకరణను 2021లో జారీ చేసింది.
ఆ తర్వాత బోర్డు కంబైన్డ్ మెడికల్ డిజెబిలిటీ ధ్రువీకరణను అదే సంవత్సరం ఇచ్చినట్లు తెలిసింది. నేత్ర వైద్య సర్జన్ డాక్టర్ ఎస్.వి.రాస్కర్ 2018 ఏప్రిల్ 25న పూజాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మయోపీ డీజనరేషన్ అనే సమస్యతో బాధపడుతోందని, 40శాతం శాశ్వత వైకల్యం ఉందని నిర్ధరించారు. ఇక 2021 జనవరిలో ఆమెను మానసిక వైద్యుడు యోగేష్ గడేకర్ పరీక్షించి ధ్రువీకరణపత్రం జారీ చేశారు.
సివిల్ సర్వీస్ పరీక్ష పాసయ్యేందుకు ఆమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని, పోస్టింగ్ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో ప్రైవేటు మెడికల్ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్నెట్ సర్టిఫికెట్ సమర్పించినట్లు తాజాగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె నాన్ క్రిమీలేయర్, వైద్య ధ్రువీకరణలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రొబేషన్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
More Stories
పీపుల్స్ ఫస్ట్ అనే నినాదంతో ఢిల్లీలో విజయం
వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది