గత లోక్సభ ఎన్నికల సమయంలో రూ. 3,475 కోట్లకు పైగా పట్టుబడింది. గత ఎన్నికల సమయంలో పట్టుబడిన దానితో పోలిస్తే ఇది 34 శాతం అధికమని తెలిపింది. సమగ్ర ప్రణాళిక, సంయుక్త కార్యాచరణ, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగల్గుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో రాజస్థాన్ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకూ మొత్తం రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత రూ. 605 కోట్లతో గుజరాత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
ఇక తమిళనాడులో రూ.460.8 కోట్లు, మహారాష్ట్రలో రూ.431.3 కోట్లు, పంజాబ్లో రూ. 311.8 కోట్లు పట్టుబడింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల అక్రమాలు, అవకతవకల్లో అత్యల్పంగా లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి.
2024 లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. తొలి ఫేజ్ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి దశలోనే ఇంత మొత్తంలో నగదు రికవరీ కావడం గమానర్హం. ఎన్నికలు ముగిసే సరికి ఇంకా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
More Stories
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్