సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గతంలో పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పిగా, పైర్ సర్వీసెస్ డిజిగా సేవలందించారు. హైదరాబాద్ రీజియన్ ఐజిగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా వివిధ హోదాల్లో పని చేశారు.
రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఆఫీసర్. గత ఏడాది మహేందర్రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్ బాస్ రేసులో రాజీవ్ రతన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు ఐపీఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు.

More Stories
నిరంతర ప్రజా ఉద్యమాలతో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను తక్షణమే అమలు చేయాలి
ధరణి లావాదేవీలపై విచారణకు సిట్