‘‘సీబీఎస్ఈ” 3, 6 తరగతుల కోసం ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023కు అనుగుణంగా రూపొందించిన కొత్త పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. 2024 ఏప్రిల్ రెండో వారం నాటికి 3 వ తరగతి పుస్తకాలు, 2024 మే మధ్య నాటికి 6 వ తరగతి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 1, 2, 7, 8, 10, 12 తరగతుల పాఠ్యపుస్తకాలకు సంబంధించి 2023-2024 ఎడిషన్లలో 1.21 కోట్ల కాపీలు విడుదలయ్యాయని ఎన్సీఈఆర్టీ తెలిపింది.
ఈ తరగతులకు అవసరమైన అదనపు పుస్తకాలను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 4, 5, 9, 11 తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలను విడుదల చేసినట్లు ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తరగతులకు సంబంధించిన 1.03 కోట్ల కాపీలు 2024 మే 31 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ పోర్టల్, పీఎం ఈ విద్య, దీక్ష, ఈ పాఠశాల పోర్టల్, నేషనల్ డిజిటల్ లైబ్రరీలో ఉచితంగా లభిస్తాయి. డిజిటల్ కాపీలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్సీఈఆర్టీ తెలిపింది.
3, 6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న అన్ని విద్యా సంస్థల అధిపతులకు మార్చిలో ఎన్సీఈఆర్టీ తెలియజేసింది. 2023 వరకు ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల స్థానంలో 3, 6 తరగతులకు ఈ కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠశాలలకు సూచించింది.
నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలులో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ( ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023) 2023 కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్ తో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే.
More Stories
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం