పతంజలి ఉత్పత్తుల గురించి తప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పారు. ఆ కేసులో ప్రత్యక్షంగా ఇవాళ ఆయన కోర్టుకు హాజరయ్యారు. రాందేవ్, బాలకృష్ణలు వ్యక్తిగతం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాల ప్రకారం ఆ ఇద్దరూ కోర్టుకు వచ్చినట్లు వాళ్ల తరపు న్యాయవాది వెల్లడించారు.
క్షమాపణలు తెలియజేస్తూ రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ పై వ్యాఖ్యానిస్తూ వారి క్షమాపణలపట్ల తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది. దీంతో కోర్టుకు వ్యక్తిగతంగా వచ్చి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ కోర్టుకు తెలియజేశారు. జస్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడికల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని బాబా రాందేవ్, బాలకృష్ణలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దుండగుడి దాడి
కర్ణాటకలో మరోసారి కుర్చీలాట