పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను ప్రకటించిన కేంద్రం 

పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సీసీఏ చట్టాన్ని అమలుపరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారత్లోకి ప్రవేశించిన ముస్లిమేతరులకు పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయడానికి పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) కోసం నిబంధనలను నోటిఫై చేసింది

ఈ వేసవిలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ పని చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ నిబంధనలను రూపొందించి నోటిఫై చేశారు. 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ సీఏఏను ఆమోదించి, 24 గంటల్లోనే చట్టాన్ని నోటిఫై చేసింది.

 పార్లమెంటరీ విధానాల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలల్లోపు ఏదైనా చట్టానికి నిబంధనలు రూపొందించాలి, లేదంటే లోక్ సభ, రాజ్యసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీల నుంచి పొడిగింపు అవసరం. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం దరఖాస్తులు సమర్పించడానికి నిబంధనలను రూపొందించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. సదరు కమిటీల నుండి క్రమం తప్పకుండా పొడిగింపులు తీసుకుంది.

సీఏఏను అమలు చేస్తామనే హామీ గత లోక్‌సభ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రధాన ఎన్నికల అజెండాగా నిలిచింది. పౌరసత్వ చట్టం, 1955 కింద పొరుగు దేశాల నుండి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడానికి గుజరాత్లోని రెండు జిల్లాల్లోని కలెక్టర్లకు అధికారం కల్పిస్తూ 2022 అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య, సిఎఎ అమలు కోసం బెంగాల్ మతువాల డిమాండ్లను పునరుద్ధరించడానికి ప్రేరేపించింది. సీఏఏ అమలుకు ఇది తొలి అడుగు అని బెంగాల్ బీజేపీ నేతలు పేర్కొన్నారు.
మతువాలు 1947 లో తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుండి,1971 భారత- పాకిస్తాన్ యుద్ధం సమయంలో వలస వచ్చిన దళిత నామసుద్ర సమాజంలో భాగం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని ఉత్తర, దక్షిణ బెంగాల్ జిల్లాల్లో వీరు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.  సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. 

సీఏఏను ఆమోదించడం వివక్షాపూరితమైనదని, రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముస్లింలను వదిలేసి, లౌకిక దేశంలో పౌరసత్వానికి విశ్వాసాన్ని ముడిపెట్టిందని చట్ట వ్యతిరేకులు ఆందోళనలకు దిగారు. 2019లో సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దాదాపు 100 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.

 ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసన సభలో తీర్మానం కూడా చేశాయి. మొత్తంగా తీవ్ర ప్రతిఘటన పరిస్థితుల మధ్య ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాగా సీఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలు పరిచినట్టయ్యింది.