* వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా
గతంలో రాజ్యసభకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్లోని పోర్ బందర్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, మనోజ్ తివారీ, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ బరిలో నిలవనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లోని గుణ స్ధానం నుంచి, రాజ్యసభ ఎంపీ భూపీందర్ యాదవ్ అళ్వార్ నుంచి లోక్సభ ఎన్నికల పోరులో దిగనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ను విదిశ నుంచి లోక్సభ బరిలో నిలిపారు.
ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం లభించగా 28 మంది మహిళలకు చోటు దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలకు అవకాశం కల్పించారు. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్ధానం కల్పించారు. తొలి జాబితాలో యువతకు 47 స్ధానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్ధానాలను కేటాయించామని పార్టీ నేత వినోద్ తావ్డే తెలిపారు.
కీలక యూపీ నుంచి 51 మంది అభ్యర్ధులను తొలి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి బరిలో నిలిచే 5గురి పేర్లను తొలి జాబితాలో వెల్లడించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్ధులకు తొలి జాబితాలో చోటు దక్కింది. అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, దిబ్రూగఢ్ నుంచి సర్బానంద సోనోవాల్, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా, పోర్ బందర్ నుంచి మన్సుఖ్ మాండవీయ, నవ్సారి నుంచి సీఆర్ పాటిల్, గొడ్డా నుంచి నిషికాంత్ దూబే ఉన్నారు.
త్రిస్సూర్ నుంచి సురేష్ గోపి, పతనంతిట్ట నుంచి అనిల్ ఆంటోనీ, తిరువనంతపురం నుంచి రాజీవ్ చంద్రశేఖర్, గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, విదిశ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, బికనీర్ నుంచి అర్జున్ మేఘ్వాల్, అల్వార్ నుంచి భూపేంద్ర యాదవ్, జోధ్ పూర్ నుంచి గజేంద్రసింగ్ షెకావత్, కోటా నుంచి ఓం బిర్లా తదితర బీజేపీ సీనియర్లు పోటీలో నిలుస్తున్నారు.
More Stories
ఎన్డీఏది అభివృద్ధి మంత్రం – వైసీపీది అవినీతి తంత్రం
కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సక్సేనా సిఫార్సు
రఫా నుంచి ఇజ్రాయిల్ లక్ష మంది తరలింపు