గతేడాది చివర్లో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన కుమారుడిని అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల్ రాజుకే సీటు ఖరారు చేసింది. దీంతో పార్టీ తీరుపై తీవ్రమైన అంసతృప్తితో ఉన్న రాములు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
అయితే తాజాగా నాగర్ కర్నూల్ ;పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన కనిపించలేదు. ఈ సమావేశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ హాజరయ్యారు. ఇదిలావుండగా, అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములు మధ్య విభేదాలు ఇటీవల కాలంలో తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బాలరాజు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఎంపీ రాములు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతారనే చర్చ మొదట్లో వినిపించింది. ఇప్పటికే మందా జగన్నాథం కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు.
రాములు కూడా టికెట్ ఖరారుపైనే ఆశలు పెట్టుకున్నారని, మరోసారి బరిలో ఉండాలని చూస్తున్నారని సమాచారం. కానీ కాంగ్రెస్ లో మల్లు రవి, జగన్నాథం, సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో రాములుకు టికెట్ దక్కకపోవచ్చన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే రాములు బీజేపీలో చేరినట్లు తెలుస్తుంది.
బీజేపీలో సిట్టింగ్ ఎంపీ రాములు చేరిన నేపథ్యంలో ఎస్సీ రిజర్వ్ డు నియోజకవర్గమైన నాగర్ కర్నూల్ నుంచి మరోసారి ఆయన బరిలో ఉండే అవకాశం ఉంది. ఆయన ఒకవేళ పోటీలో ఉండకపోతే ఆయన కుమారుడు భరత్ కు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ నేతకాని వెంకటేశ్ కూడా పార్టీని వీడి కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు. జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం.
More Stories
అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణ మంత్రివర్గ సమావేశంకు ఈసీ అనుమతి
కేజ్రీవాల్ నిరసన పిలుపుతో ఢిల్లీలో ఉద్రిక్తత