సందేశ్‌ఖలిలో ప్రజ్వరిల్లుతున్న నిరసనలు

పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కల్లోలిత సందేశ్‌ఖలిలో శుక్రవారం సరికొత్తగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. గ్రామస్థులను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఎంసి నేతల ఆస్తులకు ఆగ్రహోదగ్రులైన స్థానికులు నిప్పంటించారు. అంతే కాదు. వారు దోషుల పట్ల పోలీసులు క్రియాశూన్యతకు వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

గత 60 రోజులుగా తప్పిపోయిన పారిపోయిన టిఎంసి నాయకుడు షేక్ షహ్జహన్ అరెస్టు చేయడంలో ఆలస్యం కావడంతో సాండెష్‌ఖాలిలో నిందితుల జాబితా  పెరుగుతోంది.  టిఎంసి స్థానిక యూనిట్ అధ్యక్షుడు, నార్త్ 24-పార్గానాస్ జిల్లా పరిషత్ సభ్యుడు షాజహన్ జనవరి 5 నుండి ఈ ప్రాంతంలో కనిపించడంలేదు.  సాండేష్‌ఖాలి వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి వెతుకుతున్న ఒక బృందం అతని కోసం అన్వేషిస్తున్నది.

బిజెపి ఎంపి లాకెట్ ఛటర్జీ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఫల్గుని పట్రా నేతృత్వంలోని బిజెపి మహిళా మోర్చా ఆధ్యరంలోని రెండు వేర్వేరు బృందాలను  సందేశ్‌ఖలిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. “పోలీసులు షేక్ షాజహన్‌ను పట్టుకోలేదు. కానీ వారు రోడ్లను బారికేడ్లతో నింపి మమ్మల్ని ప్రవేశించడానికి అడ్డుకొంటున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి ఒక బృందం శుక్రవారం ఈ ప్రాంతంను సందర్శించింది. అక్కడ జరిగిన సంఘటనలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కథనాలను సుమోటు గా తీసుకొని దర్యాప్తు చేపట్టింది.  ఇప్పటికే జాతీయ ఎస్టీ, ఎస్సి కమిషన్; మహిళా కమిషన్ బృందాలు పర్యటించి  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేశాయి.

అశాంతి సమయంలో సందేశ్‌ఖలి ఝుప్‌ఖలి ప్రాంతంలోకి పోలీస్ వాహనాల ప్రవేశాన్ని నిరోధించేందుకై నివాసులు పెద్ద దుంగలతో రోడ్లపై అవరోధాలు ఏర్పాటు చేసి, వాటికి నిప్పు అంటించారు. వరుసగా రెండవ రోజు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. టిఎంసి నాయకులపై దౌర్జన్యాలు, వారి నివాసాల విధ్వంసం వార్తలు వచ్చాయి.

బెంగాల్ డిజిపి రాజీవ్ కుమార్ ఈ పరిస్థితికి స్పందిస్తూ, వరుసగా రెండవ రోజు కల్లోలిత ప్రాంతానికి వెళ్లి, అశాంతికి బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని శపథం చేశారు. కర్రలు చేత బూనిని నిరసనకారులు బెల్మజూరులో ఒక చేపల యార్డ్ సమీపంలో గుడిసెలను దగ్ధం చేయడమే కాకుండా పరారీలో ఉన్న నిందితుడు, టిఎంసి నేత షాజహాన్ షేఖ్‌పైన, అతని సోదరుడు సిరాజ్‌పైన తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 

వారు దగ్థం చేసిన గుడిసెలలో ఒకటి సిరాజ్‌కు చెందినదని వెల్లడైంది. ‘ఏళ్ల తరబడి పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మేము మా భూమిని, గౌరవాన్ని తిరిగి సంపాదించేందుకు సర్వమూ చేస్తున్నాం’ అని ఒక ప్రదర్శకుడు చెప్పాడు. ఆ తరువాత పోలీసులు జోక్యం చేసుకుని ఆగ్రహోదగ్రులైన జనాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మధ్యాహ్నం డిజిపి కుమార్ ఆ ప్రాంతానికి వచ్చి స్థానికులతో చర్చలు జరిపారు.

‘మీ ఫిర్యాదులు దాఖలు చేయండి. మేము చర్య తీసుకుంటాం. ఇక్కడ ఒక పోలీస్ శిబిరం ఏర్పాటు చేస్తాం. అయితే, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని మీకు చిత్తశుద్ధితో విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కుమార్ నివాసులతో చెప్పారు.

 అనంతరం కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘పోలీసులు చర్య తీసుకుంటారు. ఈ ప్రాంతంలో ప్రశాంతత పునరుద్ధరణకు మేము కంకణం కట్టుకున్నాం’ అని తెలిపారు. గ్రామస్థుల నుంచి అక్రమంగా లాక్కున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు.