”గత ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేయమని నాతో చెప్పిన సన్నిహితులు ఇప్పుడు ఇక్కడ లేరు. ఎన్నికల్లో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే జనసేన పోటీలో ఉండడమే కారణం. జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము. వైజాగ్ లో, ఏపీ సరిహద్దులో నన్ను ఆపాలని చూస్తే నా సత్తా చూపిస్తా” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు..
సీఎం జగన్ అప్పులు చేసి బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెబుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బటన్ నొక్కాలని జనసేనాని డిమాండ్ చేశారు. “టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తుంది. మాపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. కొందరికి భయపడే వ్యక్తిత్వం నాది కాదు” అని స్పష్టం చేశారు.
“ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లొచ్చినా నిలబెట్టుకోలేకపోయాం. జనసేనకు సీట్లు రాకపోయినా ఏళ్లుగా నిలబెట్టుకుంటూ వస్తున్నాం. నేను గాజువాకతో పాటు మరోచోట పోటీ చేయాలని అనుకుంటున్నాను. భీమవరంలో పోటీ చేయాలని కొందరు ఆహ్వానించారు. ప్రజలకు మాట ఇచ్చే ముందే బాగా ఆలోచిస్తా. మాట ఇచ్చాక ఆరునూరైనా నెరవేర్చేంతవరకు శ్రమిస్తూనే ఉంటాను” అని తెలిపారు.
జగన్ తనను ఒంటరి వాడిని చేశారని అంటున్నారని పేర్కొంటూ అందరినీ పీడించిన తానే ఒంటరివాడివెలా అవుతాడన్ని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. వైసీపీకి 50 సీట్లు కూడా కష్టమని కొందరు బెట్టింగ్లు వేస్తున్నారని చెబుతూ మీరు సిద్ధమంటే తానూ యుద్ధానికి సిద్ధమ అని పవన్ స్పష్టం చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల పరిస్థితులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ”ఓట్లు కొనాలా లేదా అనేది నేను ఎవరికీ చెప్పను. ఓట్లు కొనే పరిస్థితి లేకపోవడమే సంతోషకరం. పదేళ్ల తర్వాత అయినా సరే డబ్బుతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!