తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు… తాజా నోటిఫికేషన్

గ్రూప్-1 నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్రద్దు చేసింది. 503 పోస్టులతో ఇచ్చిన గత నోటిఫికేషన్ కు రెండు సార్లు ఎగ్జామ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు కూడా పరీక్ష రద్దు అయింది.  టీఎస్‌పీఎస్సీ ఆ వెంటనే తాజాగా 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇక, మే/జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్/అక్టోబర్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ అయింది.

కాగా,తాజానోటిఫికేషన్‌లోఅభ్యర్థులవయస్సును44నుంచి46కుపెంచుతూనిర్ణయంతీసుకున్నారు.మేలేదాజూన్‌లోప్రిలిమినరీపరీక్షసెప్టెంబర్లేదాఅక్టోబర్నెలలోమెయిన్పరీక్షనిర్వహించనున్నారు.కాగా,గతంలోదరఖాస్తుచేసినవారుఫీజుచెల్లించాల్సినఅవసరంలేదు.గతంలోగ్రూప్-1కుదరఖాస్తుచేసుకున్నవారుకూడామరోమారుదరఖాస్తుచేసుకోవాలనిటీఎస్‌పీఎస్సీప్రకటనలోస్పష్టంచేసింది.

2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా  2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది రాశారు.

పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో  సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది.  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో గ్రూప్-1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.