యెమెన్ను స్థావరంగా చేసుకున్న హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలోని పాలస్తీనియన్లను చంపడానికి నిరసగా అమెరికా, దాని భాగస్వామ్య దేశాలపై దాడులకు పాల్పడుతున్నది. ఇందులో భాగంగా ఎర్రసముద్రంలో గతకొంత కాలంగా వాణిజ్య నౌకలను డ్రోన్ బాంబుల సాయంతో ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే.
అందుకనే అంతర్జాతీయ వాణిజ్యంకు ఆటంకాలు కలిగించడంతో పాటు అమాయక ప్రజలను వాదిస్తున్న హౌతీ తిరుగుబాటుదారుల సామర్ధ్యాలను విచ్ఛిన్నం చేయడమే ఈ దాడుల లక్ష్యం అని అమెరికా స్పష్టం చేసింది. అదేవిధంగా, శనివారం యెర్ర సముద్రంలో నౌకలపై దాడులకు సిద్ధపడుతున్న హౌతీ లకు చెందిన ఆరు క్షీపనులను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
కాగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. అమెరికన్ల జోలికి వస్తే ఇలాగే ఉంటుందని, ఎట్టిపరిస్థితుల్లో ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు.
శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1- లాంగ్రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్లోని సరిహద్దు పట్టణం అల్-క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల హష్ద్-అల్- షబి, కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు బైడెన్ చెప్పారు.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ