* చేపల పడవులపై మరో పేచీ
మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. మాల్దీవుల్లో భారత వాయుసేన కార్యకలాపాలు కొనసాగేలా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు అంగీకరించాయి.
అయితే, భారత్కు చెందిన కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ ఫిష్షింగ్ బోట్లలోకి ఎక్కారని ఆరోపిస్తూ మాల్దీవుల ప్రభుత్వం మరో వివాదం రేకెక్తినిచ్చింది. దీనిపై సమాధానం చెప్పాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఈనెల 1న అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరింది. తమ ఆర్థిక జోన్లో తిరుగుతున్న మూడు మాల్దీవుల ఫిష్షింగ్ బోట్లలోకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లకు చెందిన సిబ్బంది బృందాలు ఎందుకు ఎక్కాయని ముయిజ్జు ప్రభుత్వం ప్రశ్నించింది.
మాల్దీవుల్లోని మూడు వాయు స్థావరాల్లో భారత సైనిక బలగాల స్థానంలో పౌర సిబ్బందిని నియమించేందుకు భారత్ అంగీకరించిందని మాల్దీవులు విదేశాంగ శాఖ ప్రకటించింది. మే 10లోపు సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించుకునేందుకు భారత్ అంగీకరించినట్టు తెలిపింది. ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు, ఒక సైనిక విమానం సాయంతో గత కొన్నేళ్లుగా పలు మానవతా మిషన్లు, ఇతర అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. మాల్దీవుల్లో చైనా అనుకూల నేత ముహమ్మద్ ముయిజ్జు అధ్యక్షుడయ్యాక తమ దేశం నుంచి సైనిక దళాలను మార్చ్ 15లోగా ఉపసంహరించుకోవాలని భారత్ను కోరారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అంగీకారం కుదిరింది.మార్చ్ 10 కల్లా మాల్దీవుల్లోని ఓ వాయుసేన స్థావరంలో భారత్ సైనిక సిబ్బంది స్థానంలో పౌర సిబ్బందిని పంపేందుకు భారత్ అంగీకరించింది. మే కల్లా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే, ఇటీవల భారత్ సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనా సైనిక నావను కూడా తమ పోర్టులో ఆగేందుకు అనుమతించారు.
మరోవైపు, ఈ దౌత్య వివాదాన్ని అవకాశంగా తీసుకున్న పాకిస్థాన్ మాలేకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. స్వయంగా ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం మాల్దీవులకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధం అయ్యింది.
More Stories
పారా ఛాంపియన్షిప్లో దీప్తి జీవన్జీ ప్రపంచ రికార్డు
కాలం చెల్లిన అమెరికా హెలికాప్టర్ ఇరాన్ అధ్యక్షుడి ప్రాణం తీసిందా !
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం