ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్గా ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.
ఎన్నికల నిర్వహణకు ఈసీ రాష్ట్రాలను సమాయత్తం చేస్తుంది. ఈ మేరకు లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తుంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఆ రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.
ఏప్రిల్లోనే తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ లో నిర్వహిస్తారని సమాచారం. ఇప్పటికే ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు ఈసీ వివరణ ఇచ్చింది.
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సీఎస్ సమీక్ష చేశారు. అధికారుల బదిలీలపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన దాదాపు 2 వేల మందిని బదిలీ చేసినట్లు ప్రభుత్వం ఈసీకి తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు ఇతర అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి ఈ సమీక్ష చర్చించారు. సీఎస్తో సమీక్షలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ…ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయని తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించారు. మరో మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈఓ మీనా ఆదేశించారు.
ఏపీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారని, గతేడాది అక్టోబర్ 27న జారీ చేసిన డ్రాఫ్ట్ జాబితా తర్వాత 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారని తెలిపారు. ఏపీలో జీరో, జంక్ ఓటర్లు ఉన్నారని, వాటిని 98 శాతం మేర సరిచేశామని మీనా తెలిపారు.
కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో సవరణ చేయలేదని చెబుతూ 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 2 శాతం మేర సరిదిద్దాలని చెబుతూ జీరో, జంక్ ఓటర్ల సంఖ్య గతంలోనూ ఉందని చెప్పారు.
More Stories
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు
బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?