కేంద్రమంత్రి మాట్లాడుతూ 2023 వరకు 23 ఏళ్లలో భారత్కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, ఈ ఎఫ్డీఐలో 65 శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో వచ్చాయని తెలిపారు. ఆర్థిక సమ్మేళనాన్ని ప్రస్తావిస్తూ.. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని ఆమె చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమల సమిష్టి కృషితో భారతదేశం వృద్ధిరేటుతో దూసుకుపోతోందని ఆమె తెలిపారు.
“2014 నుండి, రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉన్న విధానం సహకార సమాఖ్యవాదం, పోటీ సమాఖ్యవాదం. ఆ విధంగా 2047లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఎవరు ఎంతగానో సహకరిస్తారనే దానిపై రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి” అని ఆమె వివరించారు.
“ఇంతకుముందు కేంద్రం నుండి రాష్ట్రంకు అంటూ కేంద్రం `ఇచ్చేది’గా, రాస్త్రాలు `తీసుకొనేవి’గా సంబంధాలు ఉండెడివి. అందుకు అనువైన విధానాలు రూపొందిస్తుండేవారు. కానీ 2014 నుండి ఇది రాష్ట్రాలతో భాగస్వామ్యం; రాష్ట్రాలు కూడా ఆకాంక్షించేలా భాగస్వామ్యమే… కాబట్టి, నేను దీనిని కేంద్రం- రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం అని పిలుస్తాను, ”అని ఆమె వివరించారు.
జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పుడు సెమీకండక్టర్ల అంతర్గత ఉత్పత్తిదారుగా మారుతుందని, ఎలక్ట్రిక్ వాహనాలు భారీ స్థాయిలో ఉత్పత్తి కానున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇంకా, ఇతర అంశాలతోపాటు అధిక అమెరికా వడ్డీ రేట్ల వల్ల అంతరాయాలు ఎదురైనప్పటికీ భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని ఆమె గుర్తు చేశారు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్పై వ్యాఖ్యలు
భారత్కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు