కాలిఫోర్నియాలో హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు

 
ఖలిస్తానీ మద్దతుదారుల ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. హిందూ ఆలయాలను టార్గెట్‌ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఓ హిందూ ఆలయంపై మరోసారి దాడి చేశారు. హేవార్డ్ లోని షెరావలి ఆలయం గోడలపై ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీతో విధ్వంసం సృష్టించారు.
 
స్వామినారాయణ్ మందిర్ లో ఖలిస్తాని అనుకూల, భారత్ వ్యతిరేక, ప్రధాని మోదీ వ్యతిరేక  ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ‘మోదీ టెర్రరిస్ట్ ఖలిస్తానీ జిందాబాద్‌’ అని రాశారు. గోడ‌ల‌పై గ్రాఫిటీ రాతలకు చెందిన ఫోటోల‌ను హిందూ అమెరిక‌న్ ఫౌండేష‌న్ త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది.   ఈ విషయమై న్యూయార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని విద్వేషపు ప్రచారంగా దర్యాప్తు జరపాలని, నిందితులను శిక్షించాలని కోరింది. స్థానిక పోలీసులు దేవాలయంకు చేరుకొని, పరిస్థితులను పరిశీలించారు.
 
కాగా, గతేడాది డిసెంబర్ 23న కాలిఫోర్నియా నివార్క్‌లోని స్వామినారాయ‌ణ్ మందిరం గోడలపై ఖలిస్తాన్ మద్దతు వ్యాఖ్యలను రాసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పలు కామెంట్స్ చిత్రీకరించారు. ఒక్క అమెరికాలోనే కాదు కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై ఖలిస్తానీ తీవ్రవాదులు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.