
చాంద్ఖురి రాముడి తల్లి కౌసల్య పుట్టినిల్లుగా పరిగణిస్తుండగా, జనకపుర్ సీతమ్మ జన్మస్థలంగా భావిస్తారు. ఇక రామ జన్మభూమి ఆలయంలో హారతి పాస్ల బుకింగ్ గురువారం ప్రారంభమైంది. గర్భాలయంలో కొలువయ్యే రాముడికి రోజుకు మూడుసార్లు (ఉదయం 6.30, మధ్యాహ్నం 12.00, సాయంత్రం 7.30గంటలకు) హారతి ఇస్తామని తెలిపారు.
హారతి కోసం భక్తులకు పాస్లు ఇచ్చే ప్రక్రి య ప్రారంభమైందని హారతి పాస్ విభాగం జనరల్ మేనేజర్ ధ్రువేశ్ మిశ్రా తెలిపారు. పాస్లు ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రామాలయ సముదాయం 70 ఎకరాలు ఉండగా, అందులో 70 శాతం పచ్చదనం ఉన్నట్టు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 600 చెట్లను సంరక్షిస్తున్నట్టు వివరించారు. ఆలయ సముదాయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో సంప్రదాయ నగర శైలిలో నిర్మించినట్టు వెల్లడించారు. ఆలయంలో ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందని, మొత్తం 392 పిల్లర్లు, 44 గేట్లు ఉన్నట్టు వివరించారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద బూమ్ బ్యారియర్స్, టైర్ కిల్లర్స్, బొల్లార్డ్లు, సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో చొరబాట్లను నిరోధించే లక్ష్యంతో భద్ర తా పరికరాలను ఏర్పాటు చేసినట్టు యూపీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జనరల్ మేనేజర్ సీకే శ్రీవాస్తవ తెలిపారు.
ఆలయం వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, అనుమతిలేకుండా వచ్చే వాహనాలను బూమ్ బ్యారియర్లు అడ్డుకుంటాయని చెప్పారు. అదేసమయంలో బొల్లార్డ్లతోపాటు భూమి లోపలి నుంచి టైర్ కిల్లర్స్ పైకి వచ్చి వాహనం కదలకుండా నిరోధిస్తాయని తెలిపారు.రామమందిరంలో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ఈ తరహా పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!