హిందూ సేనకు చెందిన విష్ణు గుప్త సర్వే కోసం డిమాండ్చేశారు. విష్ణు గుప్త దాఖలు చేసిన పిటీషన్ను స్థానిక కోర్టు గత డిసెంబర్లో స్వీకరించింది. అయితే ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. తాజా తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎకరాల భూమిపై హిందువులకే హక్కును కల్పించాలని హిందూసేన డిమాండ్ చేస్తోంది.
ఇక్కడ ఉన్న కాట్ర కేశవ దేవ్ ఆలయాన్ని కూల్చి దాని స్థానంలో మసీదును నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. శ్రీ కృష్ణ జన్మస్థానం గురించి 1968లో ఓ ఒప్పందం జరిగింది. సేవా సంస్థాన్, షాహీ మజీద్ ఈద్గా ట్రస్టు మధ్య సంతకాలు జరిగాయి.
ఆ ఒప్పందం ప్రకారం శ్రీకృష్ణ జన్మభూమికి 10.9 ఎకరాలు, మసీదుకు 2.6 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కృష్ణ జన్మభూమి- షాహి మజ్జీద్ మధ్య మొత్తం 18 ఎకరాల గురించి వివాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
More Stories
ప్రైవేటు వ్యక్తుల పక్షాన ప్రభుత్వం పిటిషన్ వేయడమా?
మూడు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్