భట్టికి ఆర్థిక శాఖ, ఇరిగేషన్ ఉత్తమ్, ఐటీ శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగా… గురువారం పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే శాఖల కేటాయింపు విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం .  శనివారం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ రాజ్ భవన్ కు వివరాలను పంపింది.

శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. మంత్రుల శాఖల కేటాయింపుతో పాటు మంత్రి పదవి ఖాళీలపై కూడా చర్చించారని తెసింది. రాత్రే హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి శనివారం ఉదయమే శాఖల కేటాయింపునకు సంబంధించి మంత్రులకు సమాచారం అందించారు. కీలకమైన హోంశాఖ, విద్యుత్ శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉండనున్నాయి.

మంత్రుల శాఖలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మున్సిపల్, శాంతిభద్రతలతో పాటు కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రే చూడనున్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి – భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పౌరసరఫరాలు

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు- ఐటీ మంత్రి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ

సీతక్క- పంచాయతీరాజ్

కొండా సురేఖ- అటవీ శాఖ, దేవాదాయశాఖ

పొన్నం ప్రభాకర్‌- రవాణాశాఖ, బీసీ సంక్షేమ శాఖ

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్, టూరిజం & కల్చర్, ఆర్కియాలజీ.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- సమాచార శాఖ, రెవెన్యూ, గృహ నిర్మాణం

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ

మరోవైపు ఆరు మంత్రి పదవి ఖాళీలపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఖాళీలను వెంటనే కాకుండా సమయం తీసుకొని భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుత తెలంగాణ కేబినెట్ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏ ఒక్కరికి ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఫలితంగా ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు లేదా నేతలకు మంత్రి పదవులు దక్కే అకాశం ఉంది. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే కేవలం నాలుగింటిల్లో మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించింది. వికారాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్‌గా అవకాశం దక్కింది. నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక్క సీటు గెలవకపోయినప్పటికీ ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు.