ఈ ఎన్నికల్లో 74.96% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ సారి కనీసం 75% పోలింగ్ ను ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు చేరుకోగలిగింది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి మృతితో శ్రీగంగానగర్లోని కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది.
రాజస్థాన్ ఎన్నికల పోలింగ్ రోజు గుండె పోటుతో ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోనే మరణించారు. వారిలో ఒకరు ఒక అభ్యర్థి తరఫు పోలింగ్ ఏజెంట్ కాగా, మరొకరు వృద్ధుడైన ఓటరు అని అధికారులు తెలిపారు. కాగా, పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీగ్ జిల్లాలోని సాల్వర్ గ్రామంలో ఇరు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన కారణంగా ఓటింగ్కు కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది.
రాజస్థాన్లోని 199 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 51,000 పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రాజస్తాన్ లో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లున్నారు. కొత్తగా ఈసారి 22 లక్షల 61 వేల మందికి ఓటు హక్కు లభించింది. 3 లక్షల మంది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
పోలింగ్కు ముందే జారిపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు