టీమిండియా కాకుండా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు చెందిన ప్లేయర్స్ ఈ వరల్డ్ కప్ 2023 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ నుంచి ఇద్దరు ప్లేయర్స్, సెమీఫైనల్లో ఓడిన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఒక్కో ప్లేయర్, శ్రీలంకకు చెందిన ఒక ప్లేయర్ ఈ టీమ్ ఆఫ్ ద టోర్నీలో ఉన్నారు.
ఇండియా నుంచి కెప్టెన్ రోహిత్ తోపాటు కోహ్లి, రాహుల్, జడేజా, బుమ్రా, షమిలకు చోటు దక్కింది. ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ను మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, షేన్ వాట్సన్, వసీం అక్రమ్, సునీల్ వైద్య (జర్నలిస్ట్)లతో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఐసీసీ ఈ టీమ్ ను ప్రకటించింది. ఇండియా తరఫున ముగ్గుర బ్యాటర్లు, ఒక ఆల్ రౌండర్, ఇద్దరు బౌలర్లకు చోటు దక్కింది.
టీమ్ ఆఫ్ ద టోర్నీ ఇదే
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్ – సౌతాఫ్రికా) – 594 రన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్, ఇండియా) – 597 రన్స్
విరాట్ కోహ్లి (ఇండియా) – 765 రన్స్
డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 552 రన్స్
కేఎల్ రాహుల్ (ఇండియా) – 452 రన్స్
గ్లెన్ మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా) – 400 రన్స్, 6 వికెట్లు
రవీంద్ర జడేజా (ఇండియా) – 120 రన్స్, 16 వికెట్లు
బుమ్రా (ఇండియా) – 20 వికెట్లు
దిల్షాన్ మదుషంక (శ్రీలంక) – 21 వికెట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – 23 వికెట్లు
మహ్మద్ షమి (ఇండియా) – 24 వికెట్లు
12వ ప్లేయర్ – గెరాల్డ్ కోయెట్జీ (సౌతాఫ్రికా) – 20 వికెట్లు
More Stories
4 దశలలో మొత్తం 66.95 శాతం పోలింగ్
కోవాగ్జిన్ తీసుకున్న 30 శాతం మందిలో ఆరోగ్య సమస్యలు
చార్ధామ్ యాత్రకు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి