హ‌స్తిన‌లో న‌కిలీ వైద్యుల చేతిలో తొమ్మిది మంది బ‌లి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌లుగురు న‌కిలీ డాక్ట‌ర్ ముఠా గుట్టును పోలీసులు విప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ న‌లుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. గ్రేట‌ర్ కైలాశ్ ప్రాంతంలో ఆస్ప‌త్రి న‌డిపారు. ఆ హాస్పిట‌ల్‌లో ఇద్ద‌రు రోగులు మృతిచెందిన త‌ర్వాత జ‌రిగిన ద‌ర్యాప్తులో న‌కిలీ డాక్ట‌ర్లు ఉన్న‌ట్లు తేలింది.   దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని ఓ క్లినిక్‌లో శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్ల మృతితో వారి వ్యవహారం వెలుగు చూసింది. 

డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతని భార్య పూజా అగర్వాల్ , డాక్టర్ జస్‌ప్రీత్ సింగ్‌తో పాటు మాజీ లేబొరేటరీ టెక్నీషియన్ మహేందర్ సింగ్‌ అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.  వారి సమాచారం ప్రకారం నకిలీ సర్టిఫికేట్లతో శస్త్ర చికిత్స చేయంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో వీరి బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసుల విచారణ చేపట్టారు. దీంతో మెడికల్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. 

2022లో ఓ రోగి గాల్‌బ్యాడ‌ర్ లో ఉన్న రాళ్ల గురించి చికిత్స తీసుకున్నాడు. అయితే స‌ర్జ‌రీ చేసిన తెల్లారి ఆయ‌న మ‌ర‌ణించాడు. ఆ వ్య‌క్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌ని పోలీసులు చెప్పారు. అయితే అస‌లు డాక్ట‌రు స‌ర్జ‌రీ చేయ‌లేదని, మ‌రో డాక్ట‌ర్‌తో శ‌స్త్ర చికిత్స చేయించిన‌ట్లు తేలింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

 సరిగ్గా థియేటర్‌లోకి వెళ్లేసరికి డాక్టర్ జస్ప్రీత్ స్థానంలో పూజ, మహేంద్ర ఉన్నారు.  చివరికి ఆపరేషన్‌ తరువాత సరియైన జాగ్రత్తలు తీసుకోవడంతో తీవ్రమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. ఎలాంటి అర్హత లేకుండా, కనీస వైద్య ప్రోటోకాల్స్‌ పాటించకుండా చాలామంది రోగులకు ఇలాంటి శస్త్ర చికిత్సలు చేశారని రోగుల బంధువుల ఆరోపణలు వెల్లువెత్తాయి.  గ్రేట‌ర్ కైలాశ్ హాస్పిట‌ల్‌లో 2016 నుంచి 9 మంది రోగులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. 

ఫిజీషియ‌న్ అయిన డాక్ట‌ర్ అగ‌ర్వాల్ త‌న వ‌ద్ద ఉన్న ఫేక్ డాక్యుమెంట్ల‌తో మెడిక‌ల్ స‌ర్జ‌రీలు చేస్తున్న‌ట్లు తేలింది. ఏడు కేసులలో, వీరి నిర్లక్ష్యం కారణంగా మొత్తంగా ఏడుగురు చనిపోయారు.  ఈ కేసు విచార‌ణ సందర్భంగా ఈ క్లినిక్ నుంచి డాక్టర్ల సంతకాలు మాత్రమే ఉన్న 414 ప్రిస్కిప్ష‌న్ స్లిప్‌ల‌ను పోలీసులు సీజ్ చేశారు. ప్రెగ్నెన్సీ ట‌ర్మినేష‌న్‌కు చెందిన వివ‌రాల‌తో ఉన్న రెండు రిజిస్ట‌ర్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.  గ‌డువు ముగిసిన స‌ర్జిక‌ల్ బ్లేడ్లు, పేషెంట్ల ఒరిజిన‌ల్ బిల్లులు, 47 బ్యాంకుల‌కు చెందిన చెక్కుబుక్కులు, 54 ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు, క్రెడిట్ కార్డు మెషీన్ల‌ను అగ‌ర్వాల్ ఇంటి నుంచి రిక‌వ‌రీ చేశారు.