విశ్వంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అది కుటుంబ పార్టీగా పేరుగాంచిదని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ధ్వజమెత్తారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ అమర్, అక్బర్, అంథోనిలా మారతారనని రాహుల్ అసలు నీది ఏ జాతి చెప్పాలని ప్రశ్నించారు.
సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అవసరానికి తగినట్లుగా రూపం మార్చుకుంటాడని, అవినీతిపరులు, కమీషన్లు తీసుకునేవారిని, దేశాన్ని దోచుకునే వారిని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావడం ఖాయమని చౌబే భరోసా వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెబుతూ ఆమాట ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, అవినీత మీద పడిపోయారని చెబుతూ ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి సీఎం కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ తన 9 ఏళ్ల పాలనలో తెలంగాణను నరకప్రాయంగా మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారని, రేపో మాపో ఆమెకు శిక్ష పడడం ఖాయమని, జైలుకు వెళ్లక తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరని, ఆమెను ఎవరూ కాపాడలేరని చౌబే తేల్చి చెప్పారు.
తెలంగాణాలో చీకటి రోజులు పోయే రోజులు దగ్గరపడ్డాయని, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ రూ. 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని, ఆయన దేశమంతా తిరుగుతూ దోచుకునే పనిలో పడ్డారని ఆరోపించారు. అవినీతిపరులతో ఇండియా కూటమి ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేయడంతో పాటు భూములను సర్వే చేసి అనంతరం డిజిటలైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, మజ్లిస్ రంగ, బిల్లాలాగా మారాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్కు ఎప్పడు మద్దతు ఇవ్వలేదని, అదంతా విపక్ష పార్టీల రాజకీయ కుట్రలేనని చౌబే స్పష్టం చేశారు.
More Stories
అమిత్ షా ఫేక్ వీడియో కేసులో అర్జున్ రెడ్డి అరెస్ట్
రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ
ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ఎస్ఐబీ చీఫ్ కోసం పిటిషన్