
భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తరుఫున మూడు సంవత్సరాల పాటు కళాజాతాల నిర్వహణ కోసం వ్యక్తిగతంగా లేదా బృందాలుగా కళాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ రీజియన్ జాయింట్ డైరక్టర్ పి.రత్నాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పది మందికి పైగా కళాకారుల బృందం అయితే రూ. 2,000, బృందంలో పది మంది లోపు ఉన్నట్టయితే రూ. 1,000 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని డి.డి.గా “DDO, CBC, Visakhapatnam” పేరిట విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించవలసి ఉంటుందని ఆయన తెలిపారు.
దరఖాస్తులను అక్టోబర్ 10 సాయంత్రం ఆరు గంటల లోపు అందే విధంగా “ది జాయింట్ డైరక్టర్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, 2వ అంతస్తు, సి.జి.ఓ. కాంప్లెక్స్, ఆటోనగర్, విజయవాడ – 500007 (ఆంధ్రప్రదేశ్)” చిరునామాకు పంపాల్సి ఉంటుందని రత్నాకర్ తెలిపారు.
నక్సల్ ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ప్రాంతాల కళాకారులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే బృందంలో 50 శాతం మంది మహిళలు (మహిళా బృందాలైనా), ఎస్.సి, ఎస్.టి. కళాకారులు ఉన్న వారికి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉందని
ఈ అవకాశాన్ని కళాకారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు www.davp.nic.in లేదా www.cbcindia.gov.in వెబ్ సైట్ లలో నోటిఫికేషన్ ను చూడవచ్చని రత్నాకర్ వివరించారు.
More Stories
జగన్ హయాంలో మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తుకై డిమాండ్
ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్