
“కెనడాలోని భారతీయ సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నాము,” అని ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) చీఫ్ అని పేర్కొంది. తమ దేశం కేంద్రంగా చెలరేగుతున్న ఖలిస్థానీ ఉగ్రవాద సమస్యను కెనడా పరిష్కరించట్లేదని భారత్ అంసతృప్తిగా ఉంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ- జస్టిన్ ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై మోదీ కాస్త గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయమై కెనడాలో భారత్కు చెందిన సీనియర్ దౌత్యవేత్తను అక్కడి ప్రభుత్వం బహిష్కరించడంతోఇప్పటికే బలహీనంగా ఉన్న భారత్- కెనడా బంధం మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
పంజాబ్ జలంధర్లోని భార్సింఘ్పూర్లో జన్మించాడు నిజ్జార్. అతడిని ఎన్ఏఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించింది. గతేడాది జులైలో నిజ్జార్పై రూ. 10 లక్షల నగదు రివార్డ్ను కూడా ప్రకటించింది. కాగా కెనడా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారాలో జూన్ 18న కొందరు దుండగులు హర్దీప్ సింగ్ నిజ్జార్ను చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ విషయంపై తమకు సహకరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ట్రూడో. ఈ పరిస్థితులతో ఇండో- కెనడియన్లు భయపడాల్సి అవసరం లేదని, ఎప్పటిలాగే అందరు కలిసి మెలిసి ఉండొచ్చని ట్రూడో హామీనిచ్చారు.
More Stories
భారత్ కు బాసటగా శ్రీలంక.. ప్రధాని ట్రూడోపై మండిపాటు
కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు
కాంగ్రెస్ ను నడిపిస్తున్న `అర్బన్ నక్సల్స్’