పాకిస్థాన్తో ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్లో భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ (94 బంతుల్లో 122 పరుగులు నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (106 బంతుల్లో 111 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకాలతో విశ్వరూపం చూపారు. పాకిస్థాన్ను 228 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన మ్యాచులో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటి పాక్ను చిత్తు చేసింది.
వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్ ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్రేట్ కూడా చాలా బాగుంది. ఏకంగా 228 పరుగుల తేడాతో చిత్తవడంతో పాక్ నెట్ రన్రేట్ కూడా దారుణంగా పడిపోయింది.
సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించిన పాక్ 2 పాయింట్లతో మూడోస్థానానికి పడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. రిజర్వ్ డే అయిన సోమవారం 2 వికెట్లకు 147 పరుగుల (24.1 ఓవర్లు) వద్ద టీమిండియా బ్యాటింగ్కు దిగింది.
ఆ తర్వాత మరో వికెట్ పడకుండా 233 పరుగులు జోడించారు కోహ్లీ, రాహుల్. భారత్ నిర్ణీతం 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగలు చేసింది. కోహ్లీ (122; 94 బంతుల్లో, 9×4, 3×6), రాహుల్ (111; 106 బంతుల్లో, 12×4, 2×6), గిల్ (58; 52 బంతుల్లో, 10×4), రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో, 6×4, 4×6) రాణించారు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో కోహ్లీ, రాహుల్ బౌండరీల మోత మెగించారు. పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపారు. గాయం నుంచి కోలుకొని నెలల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సెంచరీతో ఘనంగా తన పునరాగమనాన్ని చాటాడు. పాకిస్థాన్ ముందు 357 పరుగుల భారీ లక్ష్యం ఉంది. కాగా, ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.
వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. 267 ఇన్నింగ్స్లోనే (278 మ్యాచ్లు) ఈ మైలురాయి చేరాడు. సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్లో 13వేల పరుగుల మార్క్ చేరగా, విరాట్ 267వ ఇన్నింగ్స్లోనే చేరాడు. దీంతో వన్డేల్లో అత్యంత వేగంగా 13వేల పరుగులు చేసిన క్రికెటర్గా సచిన్ రికార్డును బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.
అలాగే, ఈ మ్యాచ్లో శతకం చేసి అదరగొట్టాడు కోహ్లీ. వన్డేల్లో 47వ శతకం నమోదు చేశాడు. ఓవరాల్గా 77వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ దూకుడుగా ఆడగా, కోహ్లీ కాసేపు అతడికి స్ట్రైక్ ఎక్కువగా ఇచ్చాడు. ఈ క్రమంలో 60 బంతుల్లో రాహుల్ అర్ధ శతకానికి చేరాడు. కోహ్లీ 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ గేర్ మార్చి బౌండరీల మోత మోగించారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపారు. దీంతో 45 ఓవర్లలోనే భారత్ స్కోరు 300 పరుగులు దాటింది.
ఇక కేఎల్ రాహుల్ 100 బంతుల్లోనే శతకం చేరాడు. హిట్టింగ్ ధాటి పెంచిన కోహ్లీ 84 బంతుల్లోనే సెంచరీకి చేరి తన మార్క్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. చివరి వరకు వీరు దూకుడుగా ఆడటంతో టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. పాకిస్థాన్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇక సోమవారం 25.5 ఓవర్లు వేసిన పాకిస్థాన్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
విరాట్, రాహుల్ బాదుడుకు షహిన్, షాదాబ్ సహా పాక్ బౌలర్లు బెంబేలెత్తారు. హరిస్ రావూఫ్కు గాయమవడం కూడా పాక్కు ఎదురుదెబ్బగా మారింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. ఆరంభంలోనే తేలిపోయింది. భారత బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ వెన్నువిరిచాడు.
ఫలితంగా 32 ఓవర్లలోనే 128 పరుగులకు పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ బ్యాటర్లలో నసీమ్ షా, హరీస్ రవూఫ్ బ్యాటింగ్ చేయలేదు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఇరువురూ బ్యాటింగ్కు దిగలేదు. దీంతో 8 వికెట్ల పడగొట్టి భారత్ గెలుపొందింది. బుమ్రా, హార్ధిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లకు తలా ఓ వికెట్ దక్కింది.
More Stories
బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
ఇదో దశలో 60 శాతం దాటిన పోలింగ్
శ్రీలంకలో సీతమ్మ వారి పునః ప్రతిష్ట