ఈ భూకంప ధాటికి అనేక ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. కాలీలోని ఓ ఆసుపత్రిలో పీడియాట్రిక్, నియోనేటల్ విభాగాలు దెబ్బతిన్నాయి.శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షణ సిబ్బంది వెలికితీశారు. ఆసుపత్రుల్లోని కొంతమంది రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలీలోనే 30 శాతం వరకు ఆసుపత్రి నిర్మాణం దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.
పెరీరా, కాలీ నగరాల్లో భవనాల కూలిపోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. మానిజాలెస్లోని చారిత్రక కేథడ్రల్ టవర్ ఒకటి కూలిపోయింది. పలు ఇళ్లు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత దృష్ట్యా కొలంబియా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించింది.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీసుకురావడమే తమ తొలి ప్రాధాన్యమని అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా తెలిపారు. సైన్యం ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ సిబ్బంది, శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించే పరికరాలు, శునక దళాలను రంగంలోకి దించింది. రిమోట్ ప్రాంతాల్లో రహదారులు, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పలు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెరీరా, మానిజాలెస్, ఆర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా తదితర విమానాశ్రయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వైద్య, ప్రభుత్వ విమానాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

More Stories
‘ఇస్లామిక్ నాటో’లో చేరాలని ముస్లిం దేశాలకు పాక్ పిలుపు
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ల దాడి.. 13 మంది మృతి
లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అనుమానాస్పద మృతి