కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి రైతులు సొమ్మసిల్లారని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిరకాలుగా రైతులను ఆదుకుంటున్నారని, ఎరువుల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని బస్తా మీద ముద్రిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయం రైతులకు తెలియకూడదని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం రామగుండంలో రూ.6,300 కోట్లకుపైగా వెచ్చించి పునరుద్ధరించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ఫ్యాక్టరీతో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా చేసిందని తెలిపారు. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినా ధరల భారం రైతులపై పడకుండా సబ్సిడీ పెంచి అందుబాటు ధరలో, సకాలంలో ఎరువులను అందిస్తోందని చెప్పారు. స్వదేశీ ఎరువుల ఉత్పాదకతను పెంచడంతో వ్యవసాయ ఉత్పాదకత పెరిగిన రైతులకు వ్యయభారం తగ్గించిందని వివరించారు.
కేసీఆర్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. గతంలో ఎరువుల కొరత ఉండేది.. కానీ నేడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. మూత పడ్డ 5 ఎరువుల కర్మాగారాలను ప్రధాని మోదీ రీ ఓపెన్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేస, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయారని దుయ్యబట్టారు.
చేతగాని తనం తోనే కేంద్రం ఇచ్చే ఎరువులను కేసీఆర్ రైతులకు ఇవ్వలేకపొతున్నాడని ఇంద్రసేనారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కి రాజకీయం తప్ప ఇంకేమి చేతకాదని దుయ్యబట్టారు. మార్క్ ఫెడ్లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రైతులకు నేరుగా తామే వాటిని అందజేస్తామని హెచ్చరించారు. “రాజకీయంగా పార్టీల తరపున కొట్లడదాం. కానీ రైతులతో మాత్రం చెలగాటం వద్దు’’ అని ఇంద్రసేనారెడ్డి హితవు పలికారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా