దీంతో నిర్ణీత తేదీల్లో ఈ విమానాశ్రయంలో ఛార్టర్, బిజినెస్ జెట్ల ల్యాండింగ్ , టేకాఫ్లను అనుమతించకూడదని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఆర్మ్ ట్రాఫిక్ కంట్రోల్ మార్గదర్శకాలు జారీ చేశాయి. జీ20 సదస్సు నిర్వహించే తేదీల్లో సఫ్దర్గంజ్ ఎయిర్పోర్టును మూసివేయనున్నారు. ఇక్కడి నుంచి అత్యవసర బ్యాకప్ సపోర్ట్ , విధుల కోసం ఎయిర్ ఫోర్స్, ఎన్ఎస్జీ హెలికాప్టర్లను మాత్రమే టేకాఫ్, ల్యాండింగ్కు అనుమతిస్తారు.
దేశాధి నేతలకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీ ఎయిర్పోర్టులో మూడు సెర్మోనియల్ లాంజ్లను సిద్ధం చేశారు. వీటిలో వారు తమ నిబంధనలు పూర్తి చేసుకొని వేగంగా వెళ్లిపోవచ్చు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బది రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
కాగా, ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీస్లు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. ఢిల్లీ నుంచి బయల్దేరే 80 విమానాలు, వచ్చే మరో 80 విమానాలు రానున్న మూడు రోజుల్లో రద్దయ్యే అవకాశం ఉందని చెప్పారు. జీ20 సదస్సు కారణంగా రానున్న మూడు రోజుల్లో విధించిన ట్రాఫిక్ నిబంధనలతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈ సదస్సు కోసం ఎయిర్పోర్టులో అన్ని రకాల పరికరాలు, పార్కింగ్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని వివరించారు.
“ ఇప్పటివరకు మా అంచనాల మేరకు మూడు రోజుల్లో రాకపోకలు సాగించే 160 దేశీయ విమానాలు రద్దవుతాయని భావిస్తున్నాం. సాధారణంగా ఎయిర్ పోర్టు నిర్వహించే దేశీయ సర్వీస్ల ఆపరేషన్లలో ఇవి 6 శాతానికి సమానం. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ సర్వీసుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము ప్రయాణికుల అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించేందుకు విమానయాన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం ” అని ఢిల్లీ ఎయిర్పోర్టు లిమిటెడ్ ప్రతినిధి పేర్కొన్నారు.
మరోవైపు విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి. విస్తారా, ఎయిర్ ఇండియా, సంస్థలు తాము ఎంపిక చేసిన రీషెడ్యూల్ అయిన విమాన సర్వీసుల బుకింగ్స్ను వినియోగదారులు ఒకసారి మార్చుకొనేందుకు వీలుగా అదనపు ఛార్జీలను తొలగించాయి. ఈ విషయాన్ని ఎక్స్(ట్విటర్ ) వేదికగా ప్రకటించాయి.
More Stories
జైనూర్ లో గిరిజనులు, ఆదివాసుల ఇళ్లపై దౌర్జన్యం!
భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లలో కుప్పలుగా నల్లధనం