రాష్ట్రపతి విందు ఆహ్వానపత్రం లీకైన తర్వాత అస్సాం ముహ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ట్వీట్లో హర్షం వ్యక్తం చేశారు. `రిపబ్లిక్ ఆఫ్ భారత్’ అని రాస్తూ మన నాగరికత ముందుకు వెళ్లడం గర్వంగా ఉందని తెలిపారు. మన దేశం పేరును `ఇండియా’ నుంచి `భారత్’గా మార్చాలని గత కొంతకాలంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ దేశ పేరును మార్చాలని అనేకమార్లు తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశాన్ని `ఇండియా’ అని పిలవడం ఆపేయాలని, `భారత్’ అని పిలవాలని పలు సందర్భాలలో స్పష్టం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
2022 ఆగస్ట్ 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం చేసిన ప్రసంగంలఇండియా పేరు మార్చాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇండియా పేరును భారత్గా మార్చాలన్న అంశానికి చాలా మంది మద్దతిస్తున్నారు. భారత్ అనేది దేశ గౌరవానికి చిహ్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అన్న పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఇండియా, భారత్ అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది.
జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో `ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి విషయంలో సమస్యలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. దేశం ఇప్పటికీ, ఎన్నటికీ భారత్గానే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు తానేమీ చెప్పదలుచుకోలేదని, తాను భారత్వాసినని, తన దేశం పేరు భారత్ అని ఎప్పటికీ భారత్గానే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది ఉంటే దానికి ఆ పార్టీ చికిత్స తీసుకోవాలని హితవు పలికారు.
More Stories
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 23 శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
65 ఏళ్లలో 7.81 శాతం తగ్గిపోయిన హిందూ జనాభా
పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి