సౌత్జోన్ డిసిపి సాయిచైతన్య కధనం ప్రకారం పాకిస్తాన్ దేశం, ఖైబర్ పక్తున్కావా, షాంగల్ జిల్లా, స్వాత్ గ్రామానికి చెందిన ఫైజ్ మహ్మద్(24) బతుకు దెరువు కోసం 2018లో యూఏఈలోని షార్జ్, సైఫ్జోన్కు వెళ్లాడు. అక్కడ డిసర్ట్ స్టూడియో గార్మెంట్స్ కంపెనీలో బట్టలు కుట్టే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. 2019లో హైదరాబాద్లోని కిషన్బాగ్కు చెందిన నేహా ఫాతిమా(29)తో పరిచయం ఏర్పడింది.
తాను పనిచేస్తున్న కంపెనీలో ఫాతిమాకు టైలర్గా ఉద్యోగం ఇప్పించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో వీరు షార్జాలోనే వివాహం చేసుకోగా, వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. తర్వాత ఫాతిమా కుమారుడిని తీసుకుని ఇండియాకు వచ్చింది. నేహాఫాతిమా తల్లిదండ్రులు పాకిస్తాన్లో ఉన్న ఫైజ్మహ్మద్ను సంప్రదించారు.
ఇండియాకు రావాల్సిందిగా, తాము చూసుకుంటామని చెప్పారు. దీంతో ఫైజ్ నేపాల్ దేశానికి వచ్చాడు, అక్కడే ఫాతిమా తల్లిదండ్రులు జుబేర్ షేక్, అఫ్జల్ బేగం కలిశారు. అక్కడ కొందరిని సంప్రదించి నేపాల్ సరిహద్దు నుంచి ఇండియాలోకి 2022, నవంబర్లో వచ్చి హైదరాబాద్, కిషన్బాగ్లోని ఫాతిమాతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఫైజ్ మహ్మద్ అత్తామామ కలిసి నిందితుడికి ఆధార్ కార్డు తీసుకునేందుకు యత్నించారు.
తమ కుమారుడు మహ్మద్ గౌస్ పేరుతో ఆధార్ కార్డు తీసుకునేందుకు మాదాపూర్లోని ఆధార్ సెంటర్కు వెళ్లారు. పాకిస్తాన్ వ్యక్తికి ఇండియా గుర్తింపు కార్డు తీసుకునేందుకు యత్నిస్తున్న విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే దాడి చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా, జుబేర్ షేక్, అఫ్జల్ ఫాతిమా పరారీలో ఉన్నారు.
More Stories
విద్యా భారతి విజ్ఞాన కేంద్రంకు డా. భగవత్ తో ప్రారంభోత్సవం
కొండా సురేఖకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక
తెలంగాణాలో రాగల ఐదు రోజులు వడగాలులు