17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ను చంద్రుడిపై దించాలని నిర్ణయించిన్నట్లు ఇస్రో ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్ చేపట్టనున్నది.
అంతరిక్ష పరిశోధనల్లో దేశం సాధించిన పురోగతిని భారతీయులందరూ వీక్షించేలా ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. జాబిల్లిపై ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేలా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. సాఫ్ట్ ల్యాండింగ్కు సంబంధించి సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్ను ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో వెబ్సైట్, య్యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీ, డీడీ నేషనల్ చానల్లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.
కాగా, చంద్రయాన్-2కు చెందిన ఆర్బిటార్ ప్రదాన్ ప్రస్తుతం కక్ష్యలోనే తిరుగుతున్న విషయం తెలిసిందే.ఆ ఆర్బిటార్ విక్రమ్కు స్వాగతం చెప్పింది. ఇస్రో తన ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. `వెల్కమ్ బడ్డీ’ అంటూ ఆ మెసేజ్లో పోస్టు చేశారు. చంద్రయాన్-2 ఆర్బిటార్, చంద్రయాన్-3 ల్యాండర్తో టూ వే కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు ఇస్రో తెలిపింది.
More Stories
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు