ఆంధ్రప్రదేశ్ లోని వాహనదారులకు చేతిలో మొబైల్ ఉంటే చాలు. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్స్, సీ.బుక్ డిజీటల్ కాపీలు చూపిస్తే చాలు. APTRACITIZEN APP ద్వారా వాహన దారులు తమతమ వాహనాల ఆర్ సి బుక్, లైసెన్స్ కార్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాహనంతో రోడ్డెక్కిన సమయంలో పోలీసులు తనిఖీ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది.
ఇక మీదట ఈ ఇబ్బందుల నుంచి ఏపీ లో వాహనదారులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఇక నుండి రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ఫిజికల్ కార్డుల రూపంలో ఉండవు. మొబైల్ ఫోన్ లోని యాప్ ను ఉపయోగించి డౌన్లోడ్ చేసిన పత్రాలు మీతో ఉంటే సరిపోతుందని రవాణాశాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
దీని వలన వాహనదారులకు ఖర్చు ఆదా అవడంతోపాటు అధికారులకు బోలెడు సమయం ఆదా అవుతుంది. లైసెన్సులు, ఆర్సీల కోసం ఇప్పటి వరకు కార్డుకు రూ. 200, పోస్టల్ సర్వీస్కు రూ.25 ఇలా మొత్తం రూ. 225 చలానాతో కలిపి ఆర్ టి ఏ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా రవాణాశాఖ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో ఇప్పుడు వాహన దారులకు ఆ ఛార్జీల భారం నుండి విముక్తి దొరుకుతుంది.
ఇప్పటికే లైసెన్సులు, ఆర్సీ కార్డుల కోసం డబ్బులు చెల్లించిన వాహనదారులకు మాత్రం త్వరలో కార్డులను అందజేస్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రవాణాశాఖ కు సంబంధించిన సేవలన్నీ ‘వాహన్ పరివార్’ పేరుతో ఆన్లైన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు.
తాజాగా ఏపీలోనూ ఆ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పోలీసులు ఇక మీదట లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డు బదులుగా మీ స్మార్ట్ఫోన్ లో యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న పత్రాలను చూపిస్తే సరిపోతుంది.
ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోతే సంబంధిత పత్రాలను పేపర్ పై ప్రింట్ తీసుకొని జేబులో ఉంచుకుంటే సరిపోతుంది. వాహనదారులు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రవాణాశాఖ వెబ్సైట్ https//aptracitizen.epragathi.
More Stories
మంత్రికి వత్తాసు పలికారని కడప పోలీసులకు చార్జ్ మెమోలు
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన మీనా
ఏపీలో పెట్రోల్ బంక్లపై ఆంక్షలు