రాష్ట్రవ్యాప్తంగా ప్రణాళిక రహిత మాస్టర్ ప్లాన్లతో మున్సిపాలిటీలను నాశనం పట్టిస్తూ, బిఆర్ఎస్ నాయకుల ఆస్తుల విలువలు పెంచడమే లక్ష్యంగా పేద ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ ధ్వజమెత్తారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద డికె అరుణను పోలీసులు అడ్డుకున్నారు.
అటుగా వెళ్తున్న నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, డికె అరుణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే డికె అరుణను పోలీసులు అదుపులోకి తీసుకొని తమ వాహనంలోనే ఇందల్వాయి నుంచి హైదరాబాద్ కు తరలించారు. నిర్మల్ జిల్లాలో శాంతియుతంగా దీక్షా చేస్తున్న హరిశ్వర్ రెడ్డీ ఆరోగ్యం క్షీణంచడంతో పరామర్శించడానికి వెళ్తున్న ఆమెను సుమారు గంటకు పైగా అడ్డుకొని అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ డీకే అరుణ ను తీసుకెళ్లారు.
ఆమె వెళ్తున్న వాహనాన్ని పోలీసులు వెళ్లకుండా ముందు… వెనుక పోలీస్ వాహనాలు పెట్టీ ఎ అడ్డుకోవడంతో అమె వాహనంలోనే కూర్చోని తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు పై విమర్శలు చేస్తూ ప్రభుత్వ ఏజెంట్ లాగా పోలీసులు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. ఎలాంటి కాన్వాయ్ లేకుండా పరామర్శ చేయడానికి వెళ్తున్నా తన పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు బలవంతంగా తనను తీసుకెళ్తున్నారని ఎక్కడి వరకు తీసుకెళ్తారో ఏమో అంతు చిక్కడం లేదని ఆమె అవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం హైదరాబాద్ లో ఇంటి వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ -నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే, అతడినీ పరామర్శించడానికి వెళ్తే తనను అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షించడానికి ఉంది కానీ…ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కాదని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని భావిస్తే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని అరుణ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం..నియంతల వ్యవహరిస్తున్నారని డాలయ్యబట్టారు. మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ 220 జీవో ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా, డికె అరుణను సోన్ మండల కేంద్రంలోని గోదావరి బ్రిడ్జి వద్ద అడ్డుకొని అరెస్టు చేసి నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటి నుండి ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే 44 పై గాజులపేట్ వద్ద భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు . దీంతో పెద్దఎత్తున రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. డీకే అరుణను విడుదల చేసి నిర్మల్ పంపించేంత వరకు ధర్నా రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించారు.
More Stories
చదువుల్ని లోకకల్యాణం కోసం ఉపయోగించాలి
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
మణిపూర్ లో 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్