రియల్ ఎస్టేట్ లో అగ్రగామిగా హైదరాబాద్

కరోనా తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంటి రుణ రేట్లు, ఆస్తుల ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో 2023లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర రాష్ట్రాల కంటే హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తున్నది.   నైట్ ఫ్రాంక్ కు చెందిన సూచిక 2023 ప్రకారం  హైదరాబాద్ నగరంలో సగటు కుటుంబానికి చెందిన గృహ రుణ ఇఎంఐ ఆదాయంలో 55శాతం ఉన్నట్టు వెల్లడించింది. 

ఇక ముంబై అత్యంత భరించలేని రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా మారినట్టు ఆ సంస్థ నివేదిక తెలిపింది. మరోవైపు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రియల్ ఎస్టేట్ అత్యంత తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే నగరంలో గృహ రుణ  ఇఎంఐ నుండి ఆదాయ శాతం 23 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో, 2023లో గృహ రుణ ఇఎంఐ నుండి ఆదాయ నిష్పత్తి 31 శాతం ఉంది. ఇది 2019లో స్థోమతతో పోల్చినప్పుడు మెరుగుదల కనిపిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడానికి ముందు సంవత్సరంలో గృహ రుణ ఇఎంఐ నుండి ఆదాయ శాతం 34శాతంగా ఉండేది. 

ఏది ఏమైనప్పటికీ గృహ రుణం, ఆదాయ నిష్పత్తి ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్ అత్యంత భరించలేని రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా రెండో స్థానంలో కొనసాగుతోంది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో ఈ శాతం 30 శాతం కాగా, చెన్నై, బెంగళూరులో ఇది 28 శాతంగా ఉంది.

భారతదేశంలో రెండవ అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ అయినప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పట్లనే ఎన్నారైలు ఎక్కువగా సుముఖత చూపుతున్నారు వారి రాకతో మరింత భూమ్ రాబోతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.  అమెరికా, కెనడా, గల్ఫ్, యూరప్ మొదలైన దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలలో చాలామంది హైదరాబాద్‌లోని హౌసింగ్ యూనిట్లను ఇష్టపడుతున్నారు.

రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడులతో పోలిస్తే స్టాక్‌, మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన రాబడిని అందిస్తున్నప్పటికీ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ(ఎన్‌సిఆర్) వంటి నగరాలలో గృహాలను కొనుగోలు చేయడానికి ఎన్‌ఆర్‌ఐలు మొగ్గు చూపుతున్నారు. కరోనా సమయంలో వారి అనుభవం దీనికి కారణంగా తెలుస్తోంది.  వారిలో చాలా మంది ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నవారు మహమ్మారి సమయంలో తమ ఉద్యోగాలను కోల్పోయారు. వారు భారతదేశానికి తిరిగి భావిస్తున్నారని, అందుకే ఇంటి స్థలాలు, ఇండ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది