పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు రూ.250 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. సాయంత్రం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో అమిత్షా ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మఠం, జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదెకరాల స్థలంలో రెండేళ్ల అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ, పవిత్ర తుంగభద్రా నది తీరాన 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయం అని చెప్పారు. శ్రీరాముని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడని అంటూరాజ్యపాలనలో ప్రజలను కన్నబిడ్డల చూసుకుంటూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి శ్రీరామచంద్రుడుగా పేర్కొన్నారు. అటువంటి మర్యాద పురుషోత్తమని విగ్రహాన్ని పవిత్ర మంత్రాలయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం మన ప్రాంతవాసుల అదృష్టమని చెప్పారు. ఈ విగ్రహం ఏర్పాటుకు ముందుకు వచ్చిన జైశ్రీరామ్ ఫౌండేషన్ వారు అత్యంత అభినందనీయులుగా తెలిపారు.
More Stories
జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రత్యేక కోర్టు కోరిన సీబీఐ
పోలవరం పునరావాసంకు `ప్రత్యేక సెస్’
మహిళలు, రైతులు, నిరుద్యోగులపై కూటమి వరాల జల్లు