“నయా నిజాం కేసీఆర్ మరోసారి తన నియంతృత్వ పోకడలను చూపిస్తున్నారు. ప్రజలకు కేటాయించని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించడానికి బాట సింగారం వెళ్తున్న మా నేతలను హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేసే రీతిలో తీసుకున్న ఈ చర్య బీఆర్ఎస్ పార్టీ భయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది” అని కిషన్ రెడ్డి విమర్శించారు.
దేశంలోని ప్రతి కుటుంబం యొక్క కలలను నెరవేర్చే దిశగా నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందబం ఇంకా ఎన్ని ఇళ్లు కావాలన్నా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
అయినప్పటికీ పేద ప్రజల గోడు పట్టని కేసీఆర్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తోందని ధ్వజమెత్తారు. సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది పేదలకు అండగా బిజెపి తెలంగాణ నేడు చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనా కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అన్న విషయం బట్టబయలైందని విమర్శించారు. ఒక నేరస్థుడితో, ఉగ్రవాదితో ఎలా వ్యవహరిస్తారో.. ఇవాళ తనతో పోలీసులు అలా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను ప్రగతి భవన్లో కూర్చొని అణిచివేస్తారా? అని ప్రశ్నించారు.
ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ప్రభుత్వ తీరుపై ఈటల ఫైర్ అయ్యారు. “ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే బాధ్యత మాపై ఉంటుంది. కానీ, కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మమ్ముల్ని నిర్బంధించినంత మాత్రాన మా పోరాటం ఆగదు.మీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు” అని హెచ్చరించారు.
అరెస్టులు మాకేం కొత్తకాదు. మీ తీరు మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చడం ఖాయం. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న మీకు వారే తగిన బుద్ధి చెప్తారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే బేషరుతుగా విడుదల చేయాలి” అని ఈటల డిమాండ్ చేశారు.
More Stories
ఎన్నికల వేళ అయోధ్యలో మోదీ రామయ్య దర్శనం
ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు
బిజెపి రేజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదు