రాకెట్ను పరీక్షిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయంలో ఇప్పటివరకు సమాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. గత ఏడాది ప్రయోగించినప్పుడు విఫలమైన ఎప్సిలాన్-6 రాకెట్ను అభివృద్ధి చేసి ‘ది ఎప్సిలాన్-ఎస్’ పేరిట జపాన్ సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ పరీక్షల దశలో పేలిపోయింది. 2022 అక్టోబర్లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్ను జపాన్ ప్రయోగించింది.
అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే రాకెట్ పేలిపోయింది. పేలుడు అనంతరం ఉత్తర ఆకితా ప్రాంతంలోని ఈ పరీక్షా కేంద్రం పరిసరాల్లో భారీ ఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయి. ఘటనకు సంబంధించిన చిత్రాలను జపాన్ జాతీయ మీడియా ప్రసారం చేసింది.

More Stories
భారత్ నౌకను ఢీ కొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
పాక్ మసీదులో ఆత్మాహుతి దాడి.. 21 మంది మృతి
‘మిస్టర్ సింగ్’ పోస్ట్ తర్వాత సిక్కు ట్రక్ డ్రైవర్పై 17కత్తిపోట్లు