దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్ నగరంలో జులై 18 నుంచి జరగనున్న ‘బ్రిక్స్ పొలిటికల్ లీడర్స్ ప్లస్ డైలాగ్’ సదస్సుకు బిజెపి నలుగురు సభ్యులతో ఓ ప్రతినిధి వర్గాన్ని పంపుతుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షులు, మాజీ ఐపీఎస్ అధికారి కే. అన్నామళై నేతృత్వం వహించే ఈ బృందంలో కర్నూలుకు చెందిన బీజేపీ యువ నేత డా. వినూష రెడ్డి కూడా ఉన్నారు.
మిగతా సభ్యులుగా సత్యేన్ గులాబ్కర్, పుష్కర్ మిశ్రాలను పార్టీ ఎంపిక చేసింది. గురువారం ఈ నలుగురు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అంతర్జాతీయ వేదికపై పార్టీ తరఫున వివిధ అంశాలపై ఈ నలుగురు ప్రసంగించనున్నారు. అందులో వైద్యం, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మానవ వనరుల అభివృద్ధి అంశాలపై డా. వినూష రెడ్డి ప్రసంగించనున్నారు.
‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సులో బ్రిక్స్ దేశాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపింది. బిజెపి తరపున అంతర్జాతీయ వేదికపై ఏకంగా మూడు అంశాలపై ప్రసంగించే అవకాశం తనకు దక్కడంపై డా. వినూష రెడ్డి తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశారు.
కర్నూలుకు చెందిన డా. వృత్తిరీత్యా వైద్యురాలైన డా. వినూష రెడ్డి రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు. ఆరెస్సెస్ తో అనుబంధం కలిగిన ఆమె పార్టీ తరఫున వివిధ పత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. బ్రిక్స్ సదస్సుకు పార్టీ తనను ఎంపిక చేస్తుందని తాను అస్సలు ఊహించలేదని, తాను ఎలాంటి ప్రయత్నం కూడా చేయనేలేదని ఆమె తెలిపారు.
More Stories
నిప్పుల గండంగా మారిన తెలుగు రాష్ట్రాలు
మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలి
బిజెపి అభ్యర్థి సుజనా చౌదరికి అమరావతి రైతుల మద్దతు