“పుణ్య క్షేత్రం యాత్ర”  భారత గౌరవ్ రైలు ప్రారంభo

తీర్ధ క్షేత్రాలకు దక్షిణ మధ్య రైల్వేల నడుపుతున్న భారత్ గౌరవ్ రైళ్లకు వేలాదిమంది రైలు వినియోగదారుల నుండి  భారీ స్పందన లభిస్తున్నది.  తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణీకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ  టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌గా  ఆరంభమయిన ఈ రైలు, ఇప్పటి వరకు ఏడు ట్రిప్పులు పూర్తి చేయగా, బుధవారం  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 8వ భారత గౌరవ్ “పుణ్య క్షేత్రం యాత్ర” రైలుగా బయలుదేరింది.
ఈ రైల్ లో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్ శ్రీమతి లక్ష్మి రాజయ్య (66)  జండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటిసీ) గ్రూప్ జనరల్ మేనేజర్  పీ . రాజ్ కుమార్  కూడా  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలలోని  రైలు ప్రయాణీకులకు దేశంలోని తూర్పు, ఉత్తర భాగంలోని కొన్ని పురాతన, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి ఈ రైలు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏనిమిది  ముఖ్యమైన  స్టేషన్లలో ఎక్కే / దిగే  సౌకర్యాన్ని అందిస్తుంది. 
 
ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్ , పెందుర్,  విజయనగరంలలో కూడా ఎక్కే / దిగే  సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ రైలు 9 రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలోని పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి దివ్య/తీర్థ స్థలాలను కవర్ చేస్తుంది .
 
ఈ రైలు అందించే అపూర్వ అవకాశం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే కాకుండా మార్గమద్యoలోని స్టేషన్ల  నుండి కూడా ప్రయాణికులు ఈ రైలు ఎక్కేoదుకు ముందుకు వచ్చారు. ఈ రైలు  అన్ని వర్గాల ఆదరణను ప్రతిబింబిస్తూ 2 ఏ సీ (1 కోచ్), 3 ఏ సీ (3 కోచ్‌లు) మరియు స్లీపర్ (7 కోచ్‌లు) కలిగిన  మిశ్రమ కూర్పుతో ఏ సీ, నాన్-ఏసీ ప్రయాణీకులకు అవకాశాన్ని అందిస్తుంది.  
 
దక్షిణ మధ్య రైల్వే   జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్  గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుండి గొప్ప  స్పందన లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాత్రికులకు  వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడంలో ఇబ్బంది లేకుండా సాంస్కృతికంగా ప్రముఖ, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి రైలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. 
 
భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని కూడా ఆయన చెప్పారు. తదుపరి రైలు, 9వ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (పుణ్య క్షేత్ర యాత్ర – పూరి-కాశీ-అయోధ్య) జూలై 26 నుండి ఆగస్టు 3 వరకు తిరుగుతుంది. సికింద్రాబాద్ లో ప్రయాణమై పూరి, కోణార్క్, గయ, వారణాసి,అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లకు తీసుకెళ్లి తిరిగి వస్తుంది.