
“ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 ఉదయం 10:30 గంటల నుంచి విచారణ జరుపుతుంది. సోమ, శుక్ర మినహాయించి రోజువారీ పద్ధతిలో విచారణ జరుగుతుంది,” అని భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టులో భారత పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టానికి కూడా ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. అనంతరం జమ్ముకశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అప్పట్లో విచారణ జరిపింది అత్యున్నత న్యాయస్థానం. తిరిగి మూడేళ్ల తర్వాత ఆగస్టు 2 నుంచి విచారణను కొనసాగించనుంది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా గతంలో వ్యాజ్యలు దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి షా బైజల్, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్లు తమ పేర్లను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించింది.
మరోవైపు జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ మేరకు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ను దాఖలు చేసింది. టెర్రర్ నెట్వర్క్పై సమర్థమైన పోరాటానికి తమ నిర్ణయం ఉపయోగపడిందని వెల్లడించింది. వీధుల్లో హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, రాళ్లు రువ్వే ఘటనలు పూర్తిగా కనుమరుగైపోయాయాని పేర్కొంది.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం