పశ్చిమ బెంగాల్లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 11 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఆరుగురు టీఎంసీ సభ్యులు, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్లకు చెందిన ఒక్కో కార్యకర్త, రాజకీయ గుర్తింపు లేని మరో వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బ్యాలెట్ బాక్సుల లూటీ, పలు చోట్ల విధ్వంసం, హత్యలు వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కూచ్ బెహర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి బ్యాలెట్ బాక్సును ఎత్తుకుని రోడ్లపై పరుగులు తీస్తూ కెమెరాకు చిక్కడం సంచలనమైంది. రోడ్డున పోతున్న జనం ఈ పరిణామం చూసి అవాక్కయ్యారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు సమస్థాయిలో పోలింగ్ నిర్వహణ కట్టుదిట్టం చేసినప్పటికీ పలు ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలోని పోలీసులు, ప్రభుత్వం యంత్రాంగం, భద్రతా వ్యవస్థపై అనుమానాలు నెలకొన్నాయి.
పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. రెండు పోలింగ్ బూత్లలో బ్యాలట్ బాక్సులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోగల 3,887 సీట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. బరిలో ఉన్న 2.06లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.67 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.26 శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్తర 24 పరగణాల జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలను గవర్నర్ సివి ఆనంద బోస్ సందర్శించి హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిని, ఓటర్లను కలుసుకున్నారు. కూచ్బిహార్ జిల్లాలోని ఫలిమారి గ్రామ పంచాయతిలో బిజెపి పోలింగ్ ఏజెంట్ మాధవ్ బిశ్వాస్ హత్యకు గురయ్యారు.
బిజెపి ఏజెంట్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించకుండా టిఎంసి కార్యకర్తలు అడ్డుకున్నారని, ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో బిశ్వాస్ను టిఎంసి కార్యకర్తలు చంపివేశారని బిజెపి ఆరోపించింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని కదంబగచ్చి ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారుడు హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు.
ముర్షీదాబాద్ జిల్లాలోని కపస్దంగ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలో బాబర్ అలీ అనే టిఎంసి కార్యకర్త మరణించినట్లు పోలీసులు తెలిపారు. అదే జిల్లాలోని ఖర్గ్రామ్ ప్రాంంలో సమీరుద్దీన్ షేక్ అనే మరో టిఎంసి కార్యకర్త హత్యకు గురయ్యాడు. కాగా, కూచ్ బెహర్ జిల్లా దిన్హటలోని బారానాచైనలోని ఓ బ్యాలెట్ బాక్సుకు నిప్పుపెట్టారు. బోగస్ ఓటింగ్ జరుగుతోందన్న ఆగ్రహంతో ఓటర్లే ఈ బ్యాలెట్ బాక్సును తగులబెట్టినట్టు చెబుతున్నారు.
కూచ్ బిహార్ జిల్లాలోని తుఫాన్గంజ్ 2 పంచాయతి సమితిలో తమ బూత్ కమిటీ సభ్యుడు గణేష్ సర్కార్ కూడా బిజెపి కార్యకర్తల దాడిలో మరణించినట్లు టిఎంసి ఆరోపించింది. 70వ దశకం చివరలో జరిగిన ఎన్నికల్లో ఒకసారి జరిగాయి. మరలా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి జరుగుతున్నాయి. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు 65 వేల మంది కేంద్ర పోలీసులు బలగాలు రంగంలోకి దిగాయి.
More Stories
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ కొత్త అస్త్రం
రేజర్వేషన్లపై అమిత్ షా `నకిలీ వీడియో’పై ఎఫ్ఐఆర్
20 రోజులు కూడా సమావేశం కాని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు