కాగా, చాలా మంది మమ్మల్ని విమర్శించేందుకు ప్రయత్నిస్తారని అజిత్ పవార్ తెలిపారు. అయితే వాటికి తాము స్పందించబోమని స్పష్టం చేశారు. మూడున్నరేళ్ల కిందట ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఎంవీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేశారు. శివసేనతో కలిసి వెళ్లిన తాము బీజేపీతో కలిసి వెళ్లలేమా? అని ప్రశ్నించారు.
నాగాలాండ్లో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అదే మాదిరిగా మహారాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం బీజేపీతో కలిసినట్లు చెప్పారు. క్యాబినెట్ ప్రొఫైల్స్ ఖరారు కాగానే మహారాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు.
మరోవైపు, మహారాష్ట్ర ప్రజల అభీష్టం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని తన సహచరుల మద్దతు, వారి విశ్వాస బలంతో తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్లు పేర్కొంటూ అజిత్ పవార్ ట్వీట్ చేశారు. ప్రజల సంక్షేమం కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం తన పదవిని వినియోగిస్తానని అందులో పేర్కొన్నారు. పదవుల కోసం తాము ప్రభుత్వంలో చేరామని విమర్శించడంలో అర్థం లేదని పేర్కొంటూ జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కాగా, అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన కొంత మంది ఎన్సీపీ సహచరులను అవినీతి ఆరోపణల నుంచి ప్రధాని మోదీ తప్పించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఎన్సీపీపై హక్కు తమకే ఉందని ఎవరైనా క్లెయిమ్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని శరద్ పవార్ తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరుతామని చెప్పారు. ప్రజలు తమకు మద్దతిస్తారన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.
More Stories
జగన్ ప్రభుత్వం అభివృద్ధిలో సున్నా, అవినీతిలో జెట్ స్పీడ్
ఏపీ కొత్త డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
వీసీల నియామకంపై రాహుల్ వాఖ్యాలపై విద్యావేత్తల ఆగ్రహం