`అయినప్పటికీ మంత్రి వర్గంలో సెంథిల్ బాలాజీని కొనసాగించడంపై సహేతుకమైన ఆందోళనలు ఉన్నాయి. నిష్పాక్షిక దర్యాప్తుతోపాటు న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పనితీరు దెబ్బ తినవచ్చు. ఈ పరిస్థితుల్లో తక్షణం క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నాం` అని రాజ్ భవన్ అంతకు ముందు తన ప్రకటనలో తెలిపింది.
ఈ నెలలో సెంథిల్ బాలాజీ అధికారిక నివాసంలోనూ, చెన్నై, కరూర్లలో గల ఆయన సోదరుల ఇండ్లపైనా ఈడీ దాడులు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈడీ ఈ తనిఖీలు నిర్వహించింది. 2006లో తొలిసారి అన్నాడీఎంకే నుంచి కరూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరిగి 2011లోనూ గెలుపొందారు.
జయలలిత సారధ్యంలోని మంత్రివర్గంలో 2011-16 మధ్య రవాణా మంత్రిగా పని చేశారు. అప్పట్లోనే జాబ్స్ ఫర్ క్యాష్ కుంభకోణం వెలుగు చూడటంతో క్యాబినెట్ నుంచి తొలగింపునకు గురయ్యారు. 2016లో అరవకురిచ్చి స్థానం నుంచి గెలుపొందినా, జయలలిత తన క్యాబినెట్ లోకి సెంథిల్ బాలాజీని తీసుకోలేద.
ఏఐఏడీఎంకేలో చీలిక తర్వాత సెంథిల్ బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గ్రూపులో చేరారు. సీఎంను మార్చాలంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసినందుకు అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. 2018లో డీఎంకేలో చేరి, అరవకురిచ్చి స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు.
2019లో అరవకురిచ్చి, 2021లో కరూర్ నుంచి ఎన్నికయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ కు సెంథిల్ బాలాజీ అత్యంత సన్నిహితుడని సమాచారం. 2021లో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్టాలిన్ మంత్రివర్గంలో సెంథిల్ బాలాజీకి చోటు దక్కింది. కానీ జాబ్స్ ఫర్ క్యాష్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది.
కానీ, క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని సీఎం స్టాలిన్ తొలగించలేదు. శాఖలేని మంత్రిగా కొనసాగిస్తున్నారు. తాజాగా నేరుగా సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ రవి ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి నిర్ణయంపై సీఎం ఎంకే స్టాలిన్ భగ్గుమన్నారు. తమ క్యాబినెట్ మంత్రిని నేరుగా బర్తరఫ్ చేయడానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి అధికారం లేదని తేల్చి చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని గురువారం ప్రకటించారు.
More Stories
రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు
ఓట్ల కోసం నిప్పుతో కాంగ్రెస్ చెలగాటం
రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం.. రాజధానిగా అమరావతి చేస్తాం