ముడుమాల్ ప్రదేశంలో నిగూఢమైన మెగాలిథిక్ పొడవైన రాళ్లు సమలేఖనంలో ఉన్నాయి. ముదుమాల్ గ్రామం, హైదరాబాద్ నుండి 3 గంటల ప్రయాణంలో, మెన్హిర్లు, స్కై చార్ట్ తో కూడిన మెగాలిథిక్ సైట్ ఉంది. నారాయణపేట జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 80 పొడవైన రాళ్లవంటి మెన్హిర్లు ఉన్నాయి.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం 1500 బిసి నాటిది. ‘అలైన్మెంట్ స్టోన్స్’ కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఒక ట్రస్ట్ యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ని పొందడానికి పని చేస్తోంది. సూర్యుని కదలికను సంగ్రహించడం ద్వారా పొడవైన రాళ్లు సమయాన్ని అంచనా వేయడానికి ఒక పద్ధతిలో నిలబెట్టారని చాలామంది చారిత్రక పరిశోధకులు, పురవాస్తు శాఖ వారు కూడా దీన్ని ధ్రువీకరించారు.
ఈ ప్రదేశాన్ని ప్రచారం చేయడానికి, ట్రస్ట్ టూర్లను నిర్వహిస్తోంది. సమీపంలోని పాఠశాలల నుండి విద్యార్థులను, ఉపాధ్యాయులను తీసుకువస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పొడవాటి రాళ్లు ఇప్పుడు కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ఆ ప్రదేశంలో ఎక్కువ భాగం వ్యవసాయ సాగులో ఉంది. ఈ ప్రదేశం విధ్వంసానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం దాని పరిరక్షణకు చర్యలు చేపడుతోంది.
More Stories
హైదరాబాద్ జూలో మగ తెల్లపులి మృత్యువాత
నిశ్శబ్ద విప్లవ ఫలితం జూన్ 4న తెలుస్తుంది
తెలంగాణాలో రెండంకెల సీట్లు.. కిషన్ రెడ్డి ధీమా