
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ తీరానిు దాటిన బిపర్జోయ్ తుపాను కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు పెను విధ్వంసాన్ని మిగిల్చింది. ముఖ్యంగా విద్యుత్ రంగం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో వెయ్యికి పైగా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి.
తుపాను తీరం దాటిన తర్వాత ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పారు. అధికార యంత్రాంగం సాధించిన అతిపెద్ద విజయం అదేనని ఒకరు సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
ఆర్థికంగా మాత్రం రాష్ట్రానికి పెను నష్టాన్ని కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ రంగానికి జరిగిన నష్టం తీవ్రంగా వుందన్నారు. 5,120 విద్యుత్ స్తంభాలు తుపానుకు దెబ్బతిన్నాయి. వాటినిపునరుద్ధరించే చర్యలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే తెలిపారు.
మొత్తంగా 4,600 గ్రామాలకువిద్యుత్ సౌకర్యం కొరవడిందని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో 3,580 గ్రామాలకువిద్యుత్ను పునరుద్ధరించామని చెప్పారు. మూడు రాష్ట్ర హైవేలను మూసివేసినట్లు చెప్పారు. మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా నేల కూలి రోడ్లకు అడ్డంగా పడడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు.
ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగించి రోడ్లను రాకపోకలకుఅనువుగా మార్చడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం అందేలా చూస్తున్నామని పాండే చెప్పారు. తుపాను తీరం దాటినా ప్రచండ వేగంతో గాలులు వీస్తునుందున ప్రజలు ఇళ్లవద్దనే వుండాలని భుజ్ అధికారులు కోరారు. బలహీనపడిన తుపాను రాజస్థాన్ దిశగా పయనించడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను ప్రభావానిు, కలిగించిన నష్టానిు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం అధికారులతో కలిసి సమీక్షించారు. 18వ తేదీ వరకు 99 రైళ్లను రద్దు చేశారు. సిఎం భూపేంద్ర పటేల్తో ప్రధానినరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకునాురు. గిర్ అడవుల్లో సింహాలతోసహా వన్యప్రాణులకుచేపట్టిన భద్రతా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి రైల్వే ట్రాక్ల నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులతో మాట్లాడారు.
బీపార్జోయ్ తుఫాను ప్రభావంతో రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్లో రైలు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 14 రైళ్లను రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ భారీ వర్షపు హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో సహాయక శిబిరాలను రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
More Stories
అమెరికా చట్టాలకు భారతీయ విద్యార్థులు లోబడి ఉండాలి
భారత ప్రభుత్వాన్ని కోర్టులో ఎక్స్ సవాల్
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లలో 24 మంది మావోలు హతం