డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ మోసం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామిరెడ్డితోపాటు పీకే అయ్యర్, డీసీ ఆడిటర్ మణి ఊమెన్లను కేసులో అదుపులోకి తీసుకున్నది.
కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంక్లను మోసం చేసిన కేసులో చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంకట్రామ్రెడ్డితోపాటు మరో ఇద్దర్ని కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 8 వేల కోట్లతో బ్యాంకులను మోసం చేశారన్న కేసులో వెంకట్రామ్రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది.
తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగా వెంకట్రామ్రెడ్డిపై ఈడీ కేసు ఫైల్ చేసి దర్యాప్తు జరుపుతోంది. గతంలో వెంకట్రామ్రెడ్డికి చెందిన రూ,3,300 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన పలు బ్యాంకుల్లో 8,800 కోట్ల రుణాలు తీసుకోగా.. వాటిని తిరిగి కట్టకుండా ఎగవేయడంతో ఈడీ దాడులు చేసింది.
చాలా రోజుల నుంచి విచారించిన తర్వాత ఇవాళ అదుపులోకి తీసుకుంది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని నిధులు మళ్లించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది.
More Stories
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం