2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైట్ హౌజ్ను ట్రంప్ ఖాళీ చేశారు. అయినప్పటికీ ఆయన వద్ద ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసమైన మార్- ఎ- లాగో ఎస్టేట్లో ఎఫ్బీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
దేశానికి చెందిన అత్యంత రహస్యమైన పత్రాలను ఇతర మ్యాగజైన్లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలపై తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు .
“ఈ అవినీతి బైడెన్ ప్రభుత్వం.. నాపై మళ్లీ అభియోగాలు మోపింది. ఈ విషయం నా లాయర్లకు చెప్పింది,” అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇదే నిజమైతే ఫెడరల్ ఛార్జీలు ఎదుర్కొనున్న తొలి సిట్టింగ్/ మాజీ కమాండర్ ఇన్ చీఫ్గా ట్రంప్ అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు.sud
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ